Rain Alert for AP & TS

Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలు జర భద్రం

వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు.. జర భద్రం..

Rain Alert for AP & TS: తెలుగు రాష్ట్రాల్లో అంతటా నైరుతి రుతు పవనాలు విస్తరించాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ కేంద్రం- ఐఎండీ తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది.

రానున్న మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసిం ది. మరో మూడు రోజులపాటు ఇక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. , వరంగల్‌, హన్మకొండ, జయశంకర్‌, భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఉరుములు, మెరుపులతో మోస్త రు నుంచి భారీ వర్షం కురుస్తాయని చెప్పింది. ఆదివారం, రేపు, ఎల్లుండి కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలాఉండగా శనివారం రాత్రి హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆది, సోమవారాల్లోనూ హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరించారు.

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రకు విశాఖ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రానున్న మూడు రోజులు తేలికపా టి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్ర తీరం వెంట బలమైనగాలులు వీస్తాయని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

ఇక రాయలసీమ జిల్లాల్లో కూడా మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, లేకుంటే ఉరుములతో కూడిన జల్లులు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకటి, రెండు చోట్ల గంటకు 30-40 కి.మీ. వేగంతో బలమైన గాలులతో వీచే అవకాశముందని హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *